పారిస్ : ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల కోట్ల కోవిడ్ టీకాలను పంపిణీ చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ దీనికి సంబంధించిన డేటాను ప్రజెంట్ చేసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ఈ మైలురాయిని అందుకున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటి వరకు 2,109,696,022 కోవిడ్ టీకాలను సుమారు 215 దేశాల్లో పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టీకాలు ఇవ్వడంలో ఇజ్రాయిల్ ముందున్నది. ఆ దేశంలో పది మందిలో ఆరుగురు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు. ఆ తర్వాత స్థానంలో కెనడా ఉన్నది. కెనాడాలో ఇప్పటి వరకు 59 శాతం ప్రజలు కనీసం మొదటి డోసు టీకా తీసుకున్నారు. బ్రిటన్లో 58.3 శాతం, చిలీలో 56.6 శాతం, అమెరికాలో 51 శాతం జనాభా టీకా తీసుకున్నది.
ఇంజెక్షన్ల ఆధారంగా సేకరించిన డేటాలో.. అత్యధిక జనాభా కలిగిన మూడు దేశాల్లో పదింటిలో ఆరు ఇంజెక్షన్లు వినియోగించినట్లు డేటా అంచనా వేసింది. చైనాలో 70.4 కోట్లు, అమెరికాలో 29 కోట్లు, భారత్లో 22 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. యురోపియన్ యూనియన్ దేశాల్లో పది మందిలో నలుగురు కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. ఆ దేశాల్లో జర్మనీ 43.6 శాతంతో లీడింగ్లో ఉన్నది. ఇక ఇటలీలో 40 శాతం మంది వ్యాక్సినేట్ అయ్యారు. ఫ్రాన్స్, స్పెయిన్లో ఆ రేటు 39.4 శాతంగా ఉంది.
ప్రపంచంలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టని దేశాలు ఆరు ఉన్నాయి. నార్త్ కొరియా, హైతి, టాంజానియా, చాడ్, బురుండీ, ఎరిత్రియా దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.