ట్రిపోలి : గతవారంలో లిబియాలో జరిగిన రెండు వేర్వే పడవ ప్రమాదాల్లో 160 మందికిపైగా వలసదారులు మృత్యువాతపడ్డారని ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ విభాగం అధికారులు పేర్కొన్నారు. లిబియా తీరంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో 102 మంది మృత్యువాతపడ్డారని సమాచారం ఉందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా ఎంసెహ్లీ మంగళవారం తెలిపారు.
కనీసం ఎనిమిది మందిని రక్షించి ఒడ్డుకు చేర్చినట్లు ఆమె పేర్కొన్నారు. శనివారం జరిగిన మరో ప్రమాదం జరగ్గా లిబియా తీరరక్షక దళం కనీసం 62 మంది వలసదారుల మృతదేహాలను వెలికి తీసిందని, అదే రోజు కోస్ట్గార్డ్ మరో 210 మంది వలసదారులతో వెళ్తున్న పడవను అడ్డుకుందని చెప్పారు. ఐరోపాలో మెరుగైన జీవితాన్ని కోరుకుంటున్న వలసదారులు మధ్యధరా సముద్రం మీదుగా వలస వెళ్తున్నారు.
సెంట్రల్ మెడిటరేనియన్ మార్గంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,500 మంది వరకు మరణించారని ఆమె వివరించారు. వలసదారులను అణచివేస్తుండడంతో లిబియా నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఐఓఎం ప్రకారం గత సంవత్సరం 11,900 మంది వసలదారులను అడ్డుకోగా ఈ సారి 31,500ని అడ్డుకున్నారు. అలాగే 2020లో 980 మంది ప్రణాలు కోల్పోయారు.