ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో.. పాకిస్థాన్లో మొబైల్ ఇంటర్నెట్(Mobile Internet) సేవల్ని బంద్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగో రోజు కూడా ఇంకా ఆ సేవలు అందుబాటులోకి రాలేదు. మే 9వ తేదీన మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అయితే ఇవాళ పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. మొబైల్ ఇంటర్నెట్ సేవల పునరుద్దరణ గురించి ఇప్పటి వరకు సర్కార్కు ఎటువంటి ఆదేశాలు రాలేదని పీటీఏ వెల్లడించింది.
ఇమ్రాన్ అరెస్టుతో దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు భారీ హింసకు పాల్పడుతున్నారు. మిలిటరీ, ప్రభుత్వ బిల్డింగ్లపై దాడి చేస్తున్నారు. దీంతో లాహోర్, రావాల్పిండి, పెషావర్ లాంటి నగరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసను నియంత్రించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లను బ్లాక్ చేశారు.
మళ్లీ ప్రభుత్వ నోటీసులు వచ్చే వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తామని, కానీ యూజర్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది.