కీవ్: ఉక్రెయిన్పై ఇవాళ రష్యా విరుచుకుపడింది. ఏకథాటిగా మిస్సైళ్లతో(Missiles attack) దాడి చేసింది. కీవ్తో పాటు ఇతర నగరాలపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. కీవ్లో ఇవాళ జరిగిన దాడిలో 8 మంది మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఆరు కార్లు అంటుకున్నాయి. 15 వాహనాలు ధ్వంసం అయినట్లు ఆ దేశ మంత్రి ఒకరు తెలిపారు.
#WATCH | Aftermath of multiple strikes in Ukraine's Kyiv today
President Volodymyr Zelenskyy says many people killed and injured in multiple strikes across the country today
(Video source: Reuters) pic.twitter.com/J1Bc1JEFRM
— ANI (@ANI) October 10, 2022
గత కొన్ని గంటల నుంచి కీవ్పై నిరంతరాయంగా మిస్సైల్ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ పేలుళ్ల శబ్ధాలు ఆ ప్రాంతంలో వణుకు పుట్టిస్తున్నాయి. రెండు రోజల క్రితం క్రిమియా బ్రిడ్జ్ను పేల్చివేసిన నేపథ్యంలో.. ప్రతీకారంగా రష్యా ఈ దాడులకు దిగినట్లు భావిస్తున్నారు. కీవ్ నగరంపై మిస్సైళ్లు, డ్రోన్లు భీతావాహం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై అటాక్ మొదలుపెట్టిన రష్యా.. తొలిసారి కీవ్ సిటీ సెంటర్ను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. లివివ్, డిప్రో, జపొరోజియా నగరాల్లోనూ తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు జరుగుతున్నాయి.క్షిపణుల దాడి వల్ల కీవ్లో సబ్వే రైళ్లను నిలిపివేశారు.