న్యూయార్క్: తాగునీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్తో అనేక అనర్థాలు సంభవిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెదడులోకీ ఇవి చొచ్చుకుపోగలవని గుర్తించారు. ఈ కారణంగా ప్రవర్తనలో గణనీయమైన మార్పులు వస్తాయని వారు చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐస్ల్యాండ్ పరిశోధకుడు జైమే రాస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఈ మేర కు ఎలుకలపై చేసిన పరిశోధన ఫలితా లు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్స్లో ప్రచురితమయ్యాయి.
మధ్య వయసు, వృద్ధ ఎలుకలపై శాస్త్రవేత్తలు మూడు వారాల పాటు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా మైక్రోప్లాస్టిక్ ఉన్న తాగునీటిని వాటిని అందించారు. మూడు వారాల తర్వా త చూడగా.. మూత్రపిండాలు, మెద డు, కాలేయం, జీర్ణ వాహిక, ప్లీహం, ఊపిరితిత్తులలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయి. రక్త ప్రవాహాన్ని నాడీ వ్యవస్థ నుంచి మైక్రోప్లాస్టిక్స్ వేరు చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల న్యూరోకాగ్నిటివ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు వారు తేల్చారు.