లండన్, జూన్ 24: ఒంటికాలిపై కనీసం 10 సెకండ్ల పాటు కూడా నిలబడలేని మధ్య వయస్కులకు మరణ ముప్పు పొంచి ఉన్నట్టేనని తాజా అధ్యయనం పేర్కొన్నది. అటువంటి వారు ఒక దశాబ్దంలో మరణించే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అధ్యయన వివరాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమయ్యాయి.
సపోర్టు లేకుండా నిలబడగలిగిన వారి కంటే ఒంటికాలిపై బ్యాలెన్స్ చేయలేని వారు 10 ఏండ్లలో మరణించే అవకాశం 84 శాతం ఎక్కువగా ఉందని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2009 నుంచి బ్రెజిల్లో 1,702 మంది 50 ఏండ్లకు పైబడిన వ్యక్తులపై అధ్యయనం చేశారు. ఆయా వ్యక్తుల వయసు, ఫిట్నెస్, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.