మనీలా: పిలిప్పీన్స్లో మేగి తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో 25 మంది మృతిచెందారు. తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు ఇంకా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మేగి తుఫాన్ వల్ల సుమారు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పిలిప్పీన్స్లో ప్రతి ఏడాది కనీసం 20 ఉష్ణ తుఫాన్లు వస్తుంటాయి. తూర్పు తీరంపై మేగి తుఫాన్ విరుచుకుపడడంతో సుమారు 13వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. భారీ వర్షాలు, గాలుల వల్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇండ్లు, పొలాల్లోకి నీరు ప్రవేశించింది. గ్రామాల్లోకి మట్టి బరుద కొట్టుకువస్తోంది.