లండన్ : చీజ్బర్గర్లో ఎలుక గుడ్లను కస్టమర్ గుర్తించడంతో లండన్లోని మెక్డొనాల్డ్ (McDonald) అవుట్లెట్కు రూ 5.14 కోట్ల జరిమానా విధించారు. కస్టమర్ బర్గర్కు ఆర్డర్ ఇవ్వగా ఆపై ఫుడ్ ర్యాపర్ లోపల ఎలుక వ్యర్ధాలు కనిపించడంతో కంగుతిన్నాడు. కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అవుట్లెట్ను సందర్శించిన అధికారులు అక్కడి పరిస్ధితులను చూసి విస్తుపోయారు. అవుట్లెట్లో పారిశుద్ధ్య పరిస్ధితులు సజావుగా లేవని గుర్తించారు. ఆహారం తయారు చేసి, భద్రపరిచే ప్రదేశం సహా రెస్టారెంట్ అంతటా ఎలుకలు, ఎలుకల వ్యర్ధాలు ఉన్నట్టు వెల్లడైంది.
తనిఖీల సందర్భంగా స్టాఫ్ రూం, స్టోరేజ్ ఏరియాల్లో సైతం అపరిశుభ్రత నెలకొందని అధికారులు గుర్తించారు. పారిశుద్ధ పరిస్ధితులను ఉల్లంఘించినందుకు మెక్డొనాల్డ్ అవుట్లెట్కు రూ. 5.14 కోట్ల జరిమానా చెల్లించాలని స్ధానిక కోర్టు ఆదేశించారు. తాము తీసుకునే ఆహారం స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణంలో సిద్ధం చేశారనే నమ్మకం, భావన కస్టమర్లకు కలిగించాలని, ఈ కేసులో కస్టమర్ సత్వరమే స్పందించి దర్యాప్తు కోసం సకాలంలో కౌన్సిల్ను సంప్రదించాలని కౌన్సిలర్ కీన్ లింబజీ పేర్కొన్నారు.
Read More
Brain Surgery | వైద్యరంగంలో అద్భుతం.. గర్భంలోనే శిశువు మెదడుకు సర్జరీ