వైకుకు(యూఎస్), ఆగస్టు 10: అమెరికాలోని హవాయి దీవిలో మంగళవారం రాత్రి చెలరేగిన కార్చిచ్చు వేలాది మంది స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. మంటలు, పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలోకి దూకగా, రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించారు. కార్చిచ్చుకు బలమైన గాలులు తోడై విధ్వంసం సృష్టించడంతో కనీసం 36 మంది ఆహుతయ్యారని అధికారులు వెల్లడించారు. కనీసం 271 నిర్మాణాలు దెబ్బతిన్నాయని చెప్పారు.