బ్యాంగ్కాక్: థాయిలాండ్లో ఇవాళ కాల్పుల(Thailand Shooting) ఘటన చోటుచేసుకున్నది. నార్త్ఈస్ట్రన్ ప్రావిన్సులోని చిల్డ్రన్ డే కేర్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించినవారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సామూహిక కాల్పులకు పాల్పడింది ఓ మాజీ పోలీసు ఆఫీసర్ అని తేల్చారు. అతని కోసం గాలింపు చేపట్టారు. సాయుధుడిని పట్టుకోవాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. థాయిలాండ్లో సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదు. కానీ 2020లో ఓ సైనికుడు ఓ ప్రాపర్టీ విషయంలో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో 29 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు.