మాస్కో, మార్చి 4 : రష్యా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అంతరిక్ష పరిశోధనల్లో ఎంతగానో ఉపయోగపడే అత్యంత వేగవంతమైన రాకెట్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రోసాటామ్ అభివృద్ధి చేసిన ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్ గంటకు 3,13,822 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఇది కాంతి వేగం కంటే ఎక్కువ కావడం విశేషం. అత్యంత వేగంగా పయనించే ఈ రాకెట్ ఇంజిన్ భూమి నుంచి మార్స్ గ్రహానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిషన్ల సాయంతో మార్స్కు వెళ్లాంటే సుమారు ఏడాది సమయం పడుతుండగా.. ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్ సాయంతో 30-60 రోజుల్లోనే అంగారకుడిపైకి చేరుకోవచ్చు. ఇంధనాన్ని మండించడం ద్వారా పని చేసే సంప్రదాయ రసాయన రాకెట్ల వలె కాకుండా.. విద్యుత్తు క్షేత్రాన్ని ఉపయోగించి అయాన్లను వేగవంతం చేయడం ద్వారా ఈ ఇంజిన్ పని చేస్తుంది. హైడ్రోజన్ ఇంధన సాయంతో పని చేసే ఈ రాకెట్ ఇంజిన్ సుదీర్ఘ మిషన్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నది. దీన్ని 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రోసాటామ్ ప్రణాళికలు రచిస్తున్నది. అయితే, ఈ ఇంజిన్కు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చడం ప్రతికూలంగా మారవచ్చు. అందుకోసం న్యూక్లియర్ రియాక్టర్ల అవసరం పడవచ్చు.
ఇటలీ, ఐరోపా సమాఖ్య కూడా ఇలాంటి హైప్రొపల్షన్ సిస్టమ్ అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నాయి. ఇలాంటి ప్లాస్మా ఇంజిన్లు భవిష్యత్తులో స్పేష్ మిషన్లకు కేంద్రంగా మారే అవకాశం ఉందని అంతరిక్ష నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్స్తోపాటు సుదూర అంతరిక్ష పరిశోధనలకు ఇది కీలకం కావచ్చని భావిస్తున్నారు.
ప్లాస్మా ఇంజిన్ వేగం- 3,13,822
కిలోమీటర్లు/గంట (1,95,000 మైళ్లు)
ఇంజిన్ పవర్- 300 కిలోవాట్
మార్స్కు చేరుకోవడానికి పట్టే సమయం- 30 నుంచి 60 రోజులు
ప్రస్తుతం పడుతున్న సమయం – ఒక సంవత్సరం
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది – 2030 నాటికి