పోర్ట్ లూయిస్: మారిషస్ మాజీ ప్రధాని, అధ్యక్షుడు అనిరూద్ జుగ్నౌత్ (91) శుక్రవారం కన్నుమూశారు. ఆయన రెండుసార్లు దేశాధ్యక్షుడిగా, ఆరుసార్లు ప్రధానిగా పనిచేశారు.గతేడాది ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. కాగా, అనిరూద్ మరణానికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. జుగ్నౌత్కు గౌరవంగా భారత ప్రభుత్వం శనివారం సంతాపదినంగా ప్రకటించింది.