మ్యూనిచ్, ఫిబ్రవరి 15: రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన రక్షణ సమావేశంలో రూబియో మాట్లాడుతూ ‘భారత్తో మేము జరిపిన చర్చల్లో రష్యా నుంచి చమురును కొనుగోలు చేయమన్న హామీ వారి నుంచి లభించింది’ అని ప్రకటించారు.
ఇటీవల భారత్తో జరిగిన వాణిజ్య ఒప్పందం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయం ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ఇప్పటికే పలుసార్లు అమెరికా ప్రకటించింది.