కాబూల్ : ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లోని మిలటరీ విమానాశ్రయం వెలుపల ఆదివారం భారీ పేలుడు సంభవించడంతో పలువురు మరణించారు. పేలుడు ఘటనలో పది మంది మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయని అధికార ప్రతినిధి అబ్ధుల్ నఫీ టాకోర్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు. పేలుడు ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని స్ధానికులు తెలిపారు. విమానాశ్రయ ప్రాంతాన్ని భద్రతా దళాలు సీజ్ చేసి ఆ ప్రాంతానికి చేరుకునే రోడ్లను మూసివేశాయి.
కాగా కాబూల్లో చైనీయులు ఎక్కువగా బసచేసే హోటల్పై డిసెంబర్ 12న సాయుధ దుండగులు దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాబూల్ సహా ఆప్ఘనిస్ధాన్లో ఇటీవల ఐఎస్ స్ధానిక గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తన బాంబు పేలుళ్లు, దాడులకు తెగబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.