ఎట్టకేలకు అంత్యక్రియలు
బ్యాంకాక్, మే 6: థాయ్ల్యాండ్లో భార్య శవాన్ని 21 సంవత్సరాల పాటు ఇంటిలోనే అట్టిపెట్టుకున్న ఓ వ్యక్తి ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించాడు. విశ్రాంత సైనికాధికారి చాన్ చనవచరకర్న్ భార్య అనారోగ్యంతో రెండు దశాబ్దాల క్రితం చనిపోయింది. శవపేటికలో భార్య మృతదేహాన్ని ఉంచి ఇంటిలోనే భద్రంగా చూసుకుంటున్నాడు.
రోజూ శవపేటిక దగ్గర కూర్చుని భార్యతో ముచ్చటించేవాడు. ఏతావాతా తన వయసు 72 దాటింది. ఇంకా శవపేటిక పరిరక్షణ తనవల్ల కాదనుకున్నాడో ఏమో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ ధార్మిక సంస్థ సాయంతో కర్మకాండ పూర్తి చేశాడు. అంతటితో ఊరుకోలేదు. చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు. తాను బతికి ఉన్నంత వరకు అది తనతోనే ఉంటుందని అంటున్నాడు.