పారిస్, మే 30: సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసా చిత్తరువును ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. వృద్ధురాలి వేషంలో విగ్గు ధరించి వీల్చైర్లో వచ్చిన ఓ 36 ఏండ్ల వ్యక్తి ఫొటోపై ఓ కేకును విసిరేశాడు. అయితే, ఆ ఫొటోకు రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండటంతో ఆ కేకు మోనాలిసాకు తాకలేదు. కళాప్రియులు, సందర్శకులు, సెక్యూరిటీ నడుమే ఈ దాడి జరుగడం గమనార్హం.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతనికి మతిస్థిమితంగా లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్తరువుని ప్రస్తుతం ఫ్రాన్స్లోని లావ్రే మ్యూజియంలో సందర్శనకు ఉంచారు.