లండన్: ఆఫ్ఘనిస్తాన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాలాలా యూసుఫ్జాహి ( Malala Yousafzai ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు, బాలికల రక్షణ సమస్యాత్మకంగా మారినట్లు ఆమె వెల్లడించింది. తాలిబన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ప్రపంచ దేశాధినేతలను కోరింది. ఆఫ్ఘన్ రక్షణ కోసం బైడెన్ ఎంతో చేయాలని, చాలా ధైర్యమైన అడుగు వేయాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ విషయంలో అనేక మంది దేశాధినేతలతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు మలాలా తెలిపారు. ఆఫ్ఘన్ దేశంలో తీవ్ర మానవ సంక్షోభం ఏర్పడిందని, ఆ దేశ ప్రజలకు మద్దతు ఇవ్వాలని ఆమె తెలిపింది.
2012లో పాకిస్థాన్లోని తాలిబన్లు జరిపిన కాల్పుల్లో మలాలా యూసుఫ్జాహి గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఆమె తలలోకి బుల్లెట్లు దిగాయి. ఆ తర్వాత ఆమె లండన్లో సర్జరీ చేయించుకున్నారు. మహిళా విద్యపై ప్రచారం నిర్వస్తున్న సమయంలో పాక్ తాలిబన్లు దాడి జరిపారు. అప్పుడు మలాలా వయసు కేవలం 11 ఏళ్లే.