న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం రౌవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వెలుపల ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. ఈ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) బహుమతిగా ఆస్ట్రేలియాకు ఇచ్చింది. సోమవారం అర్ధరాత్రి 12.50 ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు ఆస్ట్రేలియన్ టుడే వార్తాకథనం పేర్కొన్నది.
426 కిలోల విగ్రహాన్ని దాని పునాది నుంచి కత్తిరించడానికి ముగ్గురు గుర్తుతెలియని దొంగలు యాంగిల్ గ్రైండర్ని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఖలిస్థాన్ ఉగ్రవాదులతో ముడిపడిన భారత వ్యతిరేక మనోభావాలు ఆస్ట్రేలియాలో తలెత్తిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.