Earthquake | పోర్ట్ మోర్స్బై : పశ్చిమ పపువా న్యూ గినియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. దాదాపు 1,000 ఇళ్లు ధ్వంసం కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈస్ట్ సెపిక్ రీజియన్లో ఈ భూకంపం సంభవించింది. రాజధాని నగరం పోర్ట్ మోర్స్బైకి వాయువ్య దిశలో దాదాపు 470 మైళ్ల దూరంలో, 25 మైళ్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.