పారిస్: గాజాపై చేస్తున్న దాడులను(Gaza Bombing) ఆపేయాలని ఇజ్రాయిల్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ కోరారు. పిల్లలు, మహిళల్ని చంపేస్తున్నారని, ఆ మారణహోమాన్ని నిలిపివేయాలన్నారు. అర్థం లేని రీతిలో బాంబు దాడుల్ని కొనసాగిస్తున్నారని, ఆ బాంబు దాడుల్ని ఆపాలని కోరుతున్నట్లు మాక్రన్ తెలిపారు. హమాస్ చేపట్టిన ఉగ్రవాద చర్యలను ఫ్రాన్స్ ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గాజాపై అటాక్ విషయం మాక్రన్ చేసిన సూచనను.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ తోసిపుచ్చారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే తాము మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నట్లు తెలిపారు. అటాక్ చేయడానికి ముందు వార్నింగ్ ఇస్తున్నామని, పౌరుల మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.