బెర్లిన్: ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు (Lufthansa) చెందిన పైలట్లు స్ట్రైక్కు దిగారు. దీంతో సంస్థ 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పైలెట్ల యూనియన్ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. విమానాల రద్దుతో జర్మనీలోని ఫ్రాంక్ఫోర్ట్, మ్యూనిచ్ ఎయిర్పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఇది లక్షా 30 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది.
లుఫ్తాన్సా పైలెట్లు ఈ ఏడాది 5.5 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్ను పైలెట్ల యూనియన్ నిరాకరించడంతో సమ్మె అనివార్యమైంది.