హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా బలగాలు మరోసారి మెరుపుదాడులతో విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం కీవ్ నగరంలో బాంబుల వర్షం కురిపించారు. దీంతో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారికంగా ధృవీకరించింది. కీవ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. కీవ్లోని మిలటరీ శిబిరాలను, ఎయిర్ఫోర్స్ ను టార్గెట్ చేస్తూ రష్యా దాడులు చేస్తోంది. కీవ్లోని ఖార్కివ్, మైదాన్ నేజాలిజెనోస్తీ ఏరియాల్లో భీకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్లో 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా మొత్తం 203 దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. తొలి రోజు 13 నగరాలపై రష్యా దాడులకు దిగింది.
Visuals from Kharkiv & Maidan Nezalezhnosti in Kyiv Ukraine this morning,amid #RussiaUkraineConflict
Two loud blasts were heard in Kyiv earlier this morning; Russian President Vladimir Putin authorized a military operation in eastern Ukraine, in Kyiv yesterday
(Source: Reuters) pic.twitter.com/7hkGvm83wi
— ANI (@ANI) February 25, 2022