లండన్, సెప్టెంబర్ 19: క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. బ్రిటన్ దేశవ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
రాణి ఎలిజబెత్ అంత్యక్రియల్లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు పాల్గొన్నారు. ఎలిజబెత్ అంత్యక్రియలను వీక్షించేందుకు బ్రిటన్తో పాటు ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల వద్ద లక్షలాది మంది ప్రజలు గుమిగూడారు.