Mumbai Blast | న్యూయార్క్, జనవరి 11: ముంబై పేలుళ్ల (2008 నవంబర్ నాటి) సూత్రధారి, తీవ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (ఎల్ఇటీ) వ్యవస్థాపకుల్లో ఒకడైన హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టావి మరణించాడని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తాజాగా ప్రకటించింది.
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్కు భుట్టావీ డిప్యూటీగా వ్యవహరించాడని పేర్కొన్నది. భుట్టావి మృతిని ధ్రువీకరిస్తూ గురువారం ప్రకటన విడుదలైంది. 2023 మే 29న పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో భుట్టావి గుండెపోటుతో మరణించాడని ఐరాస పేర్కొన్నది.