Akshardham Mahamandir | భారత్ వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం ఆదివారం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం రాబిన్స్విల్లే నగరంలో ప్రారంభమైంది. ఈ అక్షర్ధామ్ మహా మందిరంలో ఈ నెల 18 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
ఇటలీ, బల్గేరియా నుంచి దిగుమతి చేసుకొన్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపు రాయితో ఈ మందిరాన్ని నిర్మించారు. 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహాం లింకన్ లాంటి నాయకుల చిత్రాలను తీర్చిదిద్దారు.