లండన్: కెనడాలోని టొరంటోలో శనివారం ఖలిస్థానీ మద్దతుదారులు వివాదాస్పద పోస్టర్లను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రతిగా భారతీయులు కూడా ప్రదర్శన చేపట్టారు. ఇరువర్గాలు భారత్ కాన్సులేట్ ఎదుట జెండాలు పట్టుకొని పోటాపోటీగా ర్యాలీ తీశాయి.
మరోవైపు లండన్లోని భారత హై కమిషన్ ఎదుట 30 మంది ఖలిస్థానీ మద్దతుదారులు ర్యాలీలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత దౌత్య కార్యాలయం వద్ద దౌత్యవేత్త తరణ్జిత్సింగ్ సంధు భద్రతను పర్యవేక్షించారు.