జైపూర్: ఆస్ట్రేలియాకు చెందిన మరియా విహార యాత్ర కోసమని రాజస్థాన్లోని జైసల్మేర్ వచ్చింది. అక్కడ కుల్ధారా గ్రామంలో ఓ అబ్బాయిని చూసింది. అబ్బాయి కూడా ఆమెను చూశాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదురోజుల తర్వాత మరియా తిరిగి వెళ్లిపోతూ తన మనసులో మాటను చెప్పింది. పెండ్లి చేసుకొందామని ఆస్ట్రేలియాకు ఆహ్వానించింది. యువకుడు ఇండియా వదిలి రాలేనన్నాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యువకుడికి పెండ్లి అయింది. ఇదంతా 60 ఏండ్ల కింద మాట. ఇప్పుడు అతని వయస్సు 82 ఏండ్లు. ఆయనకు తాజాగా ఓ ఉత్తరం వచ్చింది. అది మరియా రాసింది. అందులో.. ‘నేను ఇప్పటికీ ఎవరినీ పెండ్లి చేసుకోలేదు. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇండియా వస్తున్నాను’ అని ఉంది.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!