నైరోబి, జనవరి 18: ఎర్రటి ముక్కుతో చిన్నగా కనిపించే క్యులియా పక్షి ఒక దేశాన్ని గడగడలాడిస్తూ నేతలకు, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నదంటే నమ్మగలరా? కాని ఇది నిజం. కెన్యా ప్రభుత్వం వీటిపై యుద్ధం ప్రకటించింది. లక్షల పక్షులను చంపడానికి చర్యలు ప్రారంభించింది. ఒకప్పుడు కరవుతో బాధపడిన కెన్యా దేశాన్ని ఈ పక్షులు తిరిగి ఆ స్థితికి తెస్తాయేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతున్నది. కెన్యాలో లక్షలాదిగా ఉన్న ఈ పక్షులు వందలాది టన్నుల ఆహార ధాన్యాలను ఆహారంగా ఆరగిస్తూ అటు రైతులను, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు పండిస్తున్న గోధుమ, బార్లీ, రైస్, సన్ఫ్లవర్ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు.