న్యూయార్క్: అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ నూతన డైరెక్టర్గా మొట్టమొదటిసారి భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికన్ సెనేట్ నుంచి గురువారం ఆమోదం లభించింది. పటేల్ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. తన నియామకానికి సెనేట్ ధ్రువీకరణ లభించిన సందర్భంగా కాష్ పటేల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎఫ్బీఐ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా తనను నియమించినందుకు అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బాండీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్లకు హాని తలపెట్టాలని భావించే వారిని వేటాడతానని ఆయన హెచ్చరించారు.