కాకోరి రైలు దోపిడీ (Kokari Robbery) సంఘటన జరిగి ఇవ్వాల్టికి సరిగ్గా 96 ఏండ్లు పూర్తయ్యాయి. ఉద్యమం కోసం తుపాకులు కొనుగోలు చేసేందుకు రైలులోకి చొరబడిన విప్లవకారులు దాదాపు రూ.4,600 నగదును దోచుకెళ్లారు. ఈ దొంగతనానికి పాల్పడిన పలువురిని విచారించిన బ్రిటీష్ పాలకులు.. నలుగురు విప్లవకారులకు ఉరిశిక్ష విధించారు. ఈ సంఘటన కాకోరి స్టేషన్ వద్ద జరుగడం వల్ల ఈ ఘటనకు కాకోరి రైలు ఘటనగా పేర్కొంటున్నారు.
స్వాతంత్య్రోద్యమం ఊపందుకోవడంతో 1920 లో మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. కొన్ని ఏండ్లలోనే ఈ ఉద్యమం ఉన్నతస్థాయికి చేరుకున్నది. అయితే, ఉద్యమకారులు ఘోరక్పూర్లోని చౌరీ-చౌరా పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారు. దాంతో ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేసేందుకు గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైన యువ ఉద్యమకారులు పార్టీ పెట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావించారు. శచీంద్రనాష్ సన్యాల్ నాయకత్వంలో హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే పార్టీని స్థాపించారు. యోగేష్ చంద్ర ఛటర్జీ, రాంప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ బక్షి పార్టీలోని ముఖ్యమైన సభ్యులుగా ఉన్నారు. అనంతర కాలంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ కూడా ఈ పార్టీలో చేరారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం ఆయుధాలు చేతపట్టాలని ఈ పార్టీ నేతలు విశ్వసించారు. తుపాకులు కొనేందుకు డబ్బు సేకరణ కోసం దోపిడీలు చేశారు. అయితే, వీరిని బందిపోటు దొంగలుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చిత్రీకరించడంతో.. ప్రభుత్వ ఖజానాకు డబ్బును తరలించే రైలులో దోపిడీకి ప్రణాళిక వేశారు.
షహరాన్పూర్ నుంచి లక్నోకు వస్తున్న రైలును టార్గెట్ చేసుకున్న పది మంది విప్లవకారులు.. కాకోరి రైల్వే స్టేషన్ వద్ద 1925 ఆగస్ట్ 9 వ తేదీన అడ్డగించారు. గార్డును అదుపులోకి తీసుకుని రైలులోని రూ.4,601 నగదును దోచుకున్నారు. ఈ సంఘటన బ్రిటీష్ పాలకుల్లో భూకంపాన్ని సృష్టించింది. ఈ ఘటనతో సంబంధమున్న 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించి.. 10 మందిని దోషులుగా తేల్చారు. 1927 ఏప్రిల్ 6 న తీర్పు వెలువరించి ఉరిశిక్ష విధించారు. పలువురికి జీవితఖైదుగా ఉంచారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్లను ఉరితీయగా.. చంద్రశేఖర ఆజాద్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. సాక్షులుగా మారడంతో మరో ఇద్దరిని విడిచిపెట్టారు.
2016: ప్రపంచంలోనే అతి పొడవైన 16 ఏండ్లపాటు చేసిన నిరాహార దీక్షను విరమించిన మణిపూర్కు చెందిన ఇరోమ్ షర్మిల
1971 : ఫ్రెండ్షిప్ ట్రీటీపై సంతకాలు చేసిన భారతదేశం-సోవియట్ రష్యా
1965: ఫెడరేషన్ ఆఫ్ మలేషియా నుంచి స్వాతంత్య్ర ప్రకటించుకున్న సింగపూర్
1945 : జపాన్లోని నాగసాకిలో అణుబాంబును జారవిడిచి పేల్చిన అమెరికా
1942: క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించిన తర్వాత మహాత్మాగాంధీని అరెస్ట్ చేసిన బ్రిటీష్ పాలకులు
1892: టు వే టెలిగ్రాఫ్ కోసం పేటెంట్ పొందిన ఎడిసన్
1831: తొలిసారి అమెరికాలో నడిచిన ఆవిరి ఇంజిన్ రైలు
1173: పీసా వాలు టవర్ నిర్మాణం ప్రారంభం
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..