వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరో 90 రోజుల్లో తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇప్పటికే పలు రాష్ర్టాల రాజధానులను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కాబూల్పై గురిపెట్టినట్లు తెలుస్తున్నదని పేర్కొంది. తాలిబన్లు నెల రోజుల్లో కాబూల్ను చుట్టుముట్టవచ్చని, ప్రస్తుతం 65 శాతం ఆఫ్ఘన్ భూభాగం తాలిబన్ల గుప్పిట్లో ఉన్నదని వెల్లడించింది.