వాషింగ్టన్ : బ్లడ్ క్యాన్సర్ రోగుల కోసం తాము రూపొందించిన యాంటిబాడీ ఆధారిత థెరపీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదముద్ర వేసిందని ‘జాన్సన్ అండ్ జాన్సన్’ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
కంపెనీ తయారుచేసిన ‘టాల్వీ’ ఇంజెక్షన్లను వారం లేదా రెండు వారాలకు ఒకమారు రోగులకు ఇవ్వటం ద్వారా రోగి శరీరంలో యాంటి బాడీలు ఏర్పడతాయని, ఈ థెరపీలో క్యాన్సర్ సెల్ను రోగ నిరోధక వ్యవస్థ అంతం చేస్తుందని తెలిపింది. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో ‘టాల్వీ’ ఇంజెక్షన్ల ద్వారా అందించే థెరపీకి యూఎస్ ఎఫ్డీఏ నుంచి ఆమోదం లభించిందని కంపెనీ పేర్కొన్నది.