Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పెంపుడు శునకం ‘కమాండర్’ (Commander) అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై విరుచుకుపడుతోంది. తాజాగా యూనిఫార్మ్డ్ విభాగంలోని మహిళా అధికారిణిని కరిచింది. ప్రస్తుతం ఆమె శ్వేతసౌధానికి చెందిన మెడికల్ యూనిట్లో చికిత్స తీసుకుంటోంది. రక్షణ సిబ్బందిని కమాండర్ కరవడం ఈ ఏడాదిలో ఇది 11వ ఘటన కావడం గమనార్హం.
కాగా, బైడెన్కు చెందిన కమాండర్ 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య కనీసం పది సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను కరిచింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం (White House)కూడా అంగీకరించింది. కమాండర్ దాడిలో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ కమాండర్ శునకం.. జర్మన్ షెపర్డ్ జాతికి చెందినదిగా తెలిపింది. ఈ శునకాన్ని బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ కానుగా ఇచ్చారట. అయితే, అంతకుముందు మేజర్ అనే శునకం కూడా బైడెన్ వద్ద ఉండేదని.. అది కూడా కమాండర్ లానే కొంత మంది సీక్రెట్ సర్వీస్ అధికారుల్ని కరుస్తుండటంతో దాన్ని అధ్యక్షుడు తన మిత్రుల వద్దకు పంపించేసినట్లు వెల్లడించింది.
Also Read..
Manipur Violence | మణిపూర్లో రెండో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసన.. పలువురికి గాయాలు
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్
Mahindra | ఆ కారులో అందుకే ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కాలేదు.. యూపీ ఘటనపై స్పందించిన మహీంద్రా సంస్థ