టోక్యో: ప్రాణాంతక ‘నిపా’ వైరస్ కొత్త కేసులు భారత్లో నమోదవుతున్న వేళ, ఈ వైరస్కు జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్పై ఏప్రిల్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. బెల్జియంలో ‘మొదటి దశ’ క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నారు. 60 మంది వలంటీర్లపై ప్రయోగాలు చేయబోతున్నారు.ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో అనుకున్న ఫలితాలు వెలువడ్డాయని నివేదిక పేర్కొన్నది.