టోక్యో: పగటి కలలకు చెక్ పెట్టే ఎలక్ట్రానిక్ అలారంను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పగటివేళ ఏకాగ్రత కోల్పోయి మనసు ఊహాలోకంలోకి వెళితే ఈ అలారం మోగుతుంది. తల మీద ఏర్పాటుచేసే ఎలక్ట్రాడ్లు వ్యక్తి ఏకాగ్రత కోల్పోయారని గుర్తిస్తుంది. వెంటనే అలారం మోగుతుంది. దీనిని 36 మందిపై ప్రయోగించారు. దీని ద్వారా వారు పగటి కలలు కనడం తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు తమ సమయంలో పావు వంతు నుంచి అర్ధభాగం వరకు పగటికలల్లోనే ఉంటారు. ఈ సమస్యకు ఈ ఎలక్ట్రానిక్ అలారం పరిష్కారం చూపనుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.