టోక్యో : జపాన్లోని సుషీర్ చైన్ అనే వ్యాపార సంస్థ ఒక బాలుడిపై 67 మిలియన్ యెన్లు (4 కోట్ల రూపాయలు) నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఒక బాలుడిపై దావా వేసింది. ఆ బాలుడి నిర్వాకం కారణంగా తమ సంస్థ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయి తీవ్ర నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. సుషిరో కంపెనీకి చెందిన ఉత్పత్తులు తయారైన తర్వాత కన్వేయర్ బెల్టుపై వెళ్తుండగా, ఒక హైస్కూల్ విద్యార్థి తన వేలిని చీకి కన్వేయర్ బెల్టుపై ఉన్న ఒక ప్లేట్ను తాకాడు. సోయాసాస్ బాటిల్, కప్ను నాకాడు. సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బాలుడి చర్య కారణంగా సంస్థ ఉత్పత్తుల ఆమ్మకాలు తగ్గాయని, వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం పడి 16 బిలియన్ యెన్ల నష్టం వాటిల్లిందని, దానికి అతడు ఫైన్ చెల్లించాలంటూ సుషిరో సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.