టోక్యో, మార్చి 6: జపాన్ జనాభా క్షీణత ఇంతే వేగంగా కొనసాగితే భవిష్యత్తులో తమ దేశం కనుమరుగు కావచ్చని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా సహాయకురాలు మసాకో మోరీ హెచ్చరించారు. 2022లో జపాన్లో జన్మించిన వారి కంటే రెట్టింపు మంది మరణించారని తెలిపారు. జనన రేటు పతనాన్ని తగ్గించకపోతే, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం కనిపించకుండా పోతుందని హెచ్చరించారు. 2008లో 128 మిలియన్లు ఉన్న జపాన్ జనాభా 124.8 మిలియన్లకు పడిపోయింది. జనాభా క్షీణత రేటు పెరుగుతుండటంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.