ఇటీవల జరిగిన బ్రిటన్ రాణి అంత్యక్రియల కన్నా భారీగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికోసం భారీగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల కోసం 1.3 బిలియన్ యెన్ (సుమారు రూ.74 కోట్లు) ఖర్చయింది.
ఇప్పుడు షింజో అబె స్టేట్ ఫ్యూనరల్ కోసం 1.66 బిలియన్ యెన్ (దాదాపు రూ.94 కోట్లు) ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రచారంలో సందర్భంగా రోడ్డుపై ప్రసంగిస్తున్న సమయంలో షింజో అబెను ఒక వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే.