లండన్: బ్రిటన్ రాజు చార్లెస్-3కి చిన్న కొడుకు బెంగ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. శనివారం జరిగిన పట్టాభిషేకానికి హాజరైన చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వెంటనే వెనుదిరిగారు. అదే రోజు ఆయన కుమారుడు ఆర్చీ పుట్టిన రోజు ఉండటంతో అమెరికాకు వెళ్లిపోయారు.
ఇదే చార్లెస్ అసంతృప్తికి కారణమైంది. అయితే, మనవడు ఆర్చీకి మాత్రం చార్లెస్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పట్టాభిషేక వేడుకకు ప్రిన్స్ హ్యారీ భార్య మెఘన్ హాజరుకాలేదు. హ్యారీ కూడా తన తండ్రి చార్లెస్, సోదరుడు ప్రిన్స్ విలియంతో మాట్లాడలేదు. కొంత దూరంగా ఇతర బంధువులతో కలిసి కూర్చొని వేడుకను చూశారు.