ఇస్తాంబుల్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఆదివారం బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాంబును అమర్చిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. అందుకు ముందు 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారని, 81 మంది గాయపడ్డారన్నారు. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ఇస్తిక్లాల్ స్ట్రీట్లో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అధ్యక్షుడు ఎర్డోగాన్ అనుమానం తెలిపారు. టర్కీ అధికారులు ఈ ఉగ్రవాద చర్యపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరో వైపు ఈ ఘటనకు కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) కారణమని టర్కీ మంత్రి ఒకరు ఆరోపించారు.