టెల్ అవీవ్ : ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas war) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ఇజ్రాయెల్ వైపున ఇప్పటివరకూ 400 మందికి పైగా మరణించారు. దాడుల్లో పెద్దసంఖ్యలో సైనికులు, పోలీసులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఈ దాడుల్లో గాయపడిన 2048 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది పరిస్ధితి విషమంగా ఉందని, 330 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేపట్టిన హమాస్ దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రాకెట్ దాడులతో విరుచుకుపడుతోందిన. గాజాలో పలువురు ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
ఇక ఇజ్రాయెల్లో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సాయం అవసరమైతే రాయబార కార్యాలయాలన్ని సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు ఈనెల 14 వరకూ ఎయిరిండియా విమానాల రాకపోకలను (Air India flights) నిలిపివేశారు. తమ ప్రయాణీకులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్లైన్ ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు.
Read More :