Israel-Hamas War | గత నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. గాజాపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)ని ఆదేశించారు. అదే సమయంలో అణుబాంబు దాడిపై వ్యాఖ్యలు చేసిన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలగించారు. సమావేశంలో అనుదాడిపై చర్చించాలని ప్రతిపాదించినందుకు సస్పెండ్ చేశారు.
ఇజ్రాయెల్ అణు విధానంపై ప్రభుత్వంలో భాగమైన రైట్ ఓట్జ్మా యెహుదిత్ పార్టీకి చెందిన మంత్రి ఎలియాహుపై చర్యలు చేపట్టారు. హమాస్ పాలిత గాజా స్ట్రిప్పై అణుబాంబు దాడి ఓ ఎంపిక అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పెంచిన నేపథ్యంలో అణుబాంబు వేసే అవకాశం ఉందా? అని మంత్రిని ప్రశ్నించగా.. పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాలక, ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తమయ్యాయి. దాంతో ఆయనను తొలగించాలనే డిమాండ్ వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎలియాహు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
ఈ సందర్భంగా నెతన్యాహు స్పందిస్తూ అమాయకులకు హానితలపెట్టని రీతిలో అత్యున్న అంతర్జాతీయ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా ఇజ్రాయెల్, ఐడీఎఫ్ వ్యవహరిస్తున్నాయన్నారు. హమాస్పై విజయం సాధించే వరకు దాడులు కొనసాగుతాయని పీఎంఓ ఓ ప్రకటన ప్రకటనలో తెలిపింది. ఎలియాహు భద్రతా క్యాబినెట్లో మంత్రి భాగం కాదని.. ఇస్లామిస్ట్ హమాస్కు వ్యతిరేకంగా యుద్ధాన్ని నిర్దేశించే మంత్రిత్వశాఖపై అతని ప్రభావం లేదని తెలిపింది.