Today History: ఐఎస్ఓ.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్.. ప్రపంచవ్యాప్తంగా నాణ్యత ప్రామాణికతకు సెట్టింగ్ మారిన పేరిది. 1947 లో సరిగ్గా ఇదే రోజున ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థలో ప్రస్తుతం 165 దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి. మనం ఏ వస్తువు కొనుగోలు చేసిన దాని నాణ్యతపై మొదట దృష్టిపెడతాం. జాతీయ స్థాయిలో ఐఎస్ఐ గుర్తింపును ప్రామాణికంగా తీసుకుంటాం. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో ఒక పరిశ్రమ పనితీరు, నిర్వహణ బాధ్యత, ఉత్పత్తుల నాణ్యత, సేవల నాణ్యత వంటి వాటికి ప్రామాణికత కల్పించేందుకు ఐఎస్ఐ పనిచేస్తుంది.
ఐఎస్ఓ సంస్థకు పునాది 1947లో ప్రస్తుత లండన్లో జరిగింది. ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ. ఈ సంస్థ జారీ చేస్తున్న ధ్రువీకరణపత్రాలు వివిధ సంస్థలు, పరిశ్రమల వ్యాపారం విశ్వసనీయతను మెరుగుపరచడంలో, అలాగే వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది. జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఐఎస్ఓ 9000, ఐఎస్ఓ 9001, ఐఎస్ఓ 9001:2015 వంటి వివిధ రకాల ధ్రువపత్రాలను ఈ సంస్థ అందజేస్తుంది. ఇవన్నీ సభ్య దేశాల్లో తయారయ్యే ఉత్పత్తులు, సేవల నాణ్యతకు ప్రామాణికంగా తీసుకోవచ్చు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, అవసరాలు, ప్రమాణాలు కూడా మారుతున్నాయి. అలాగే, ఆధునికత చోటు చేసుకుంటున్నాయి. ఐఎస్ఓ 9000 నుంచి ISO 9001కి నవీకరణ ఈ మార్పులపై ఆధారపడి ఉంటాయి. ఐఎస్ఓ ధ్రువీకరణ అనేది పరిశ్రమలోని అనేక రంగాలలో శక్తి నిర్వహణ, సామాజిక బాధ్యత నుంచి వైద్య పరికరాల వరకు జరుగుతుంది. ప్రతి ఐఎస్ఓ సర్టిఫికేట్కు వేర్వేరు ప్రమాణాలు ఉన్నాయి. దాని ప్రకారం నిబంధనలు, షరతులు కూడా నిర్ణయిస్తారు. ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్.. భారత్లో 1955 లో ఏర్పడిన ఈ సంస్థ విశ్వాసానికి చిహ్నంగా మారింది. 1987 లో దీని పేరును బీఐఎస్ – బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మార్చారు. ఒక ఉత్పత్తి నాణ్యతకు ఐఎస్ఐ హామీ ఇస్తే, ఒక ఉత్పత్తిని తయారు చేసే లేదా సేవలను అందించే ప్రక్రియను ధ్రువీకరిస్తుంది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం