టెహ్రాన్: ఇరాన్కు చెందిన మహిళల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గెస్ మొహమ్మది సోమవారం జైల్లోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను దవాఖానకు తీసుకెళ్లేందుకు అధికారులు నిరాకరించడంతో పాటు కఠిన హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు.
హిజాబ్ ధరించలేదని గుండె, ఊపిరితిత్తుల సంబంధిత చికిత్స కోసం దవాఖానకు తరలించేందుకు అధికారులు అనుమతించలేదని హెచ్ఆర్ఏఎన్ఏ పేర్కొన్నది.