టెహ్రాన్, ఏప్రిల్ 5: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను వాషింగ్టన్ అనుసరిస్తున్నదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖాలీబాప్ ఆరోపించారు. ట్రంప్ అవివేక చర్యలు అమెరికా కుటుంబాలను ప్రత్యక్ష నరకంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.
నెతన్యాహు ఆదేశాలను పాటించేందుకే ట్రంప్ మొగ్గుచూపుతున్నందుకు ఈ ప్రాంతం మొత్తం తగలబడుతుందని ఆయన హెచ్చరించారు. ఎలాంటి తప్పులు చేయొద్దని, యుద్ధ నేరాలతో మీకు వచ్చే ప్రయోజనం ఏం ఉండదని ఆయన ట్రంప్నకు స్పష్టంచేశారు.