టెహ్రాన్: హొర్ముజ్ జల సంధి గుండా తమ దేశ ఓడరేవులకు నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు శనివారం ఆ దేశ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది. ప్రస్తుతం ఒమన్ గల్ఫ్లో ఉన్న నౌకలతో సహా ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆ వార్తాసంస్థ తెలిపింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎదురైన ఒడిదుడుకుల నుంచి భారత్ దృఢంగా బయటపడిందని మన విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా ఇటలీ అందిస్తున్న సహాయం గురించి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సౌదీ అరేబియా ప్రధాని సల్మాన్తో చర్చించారు.