Iran | టెహ్రాన్, ఏప్రిల్ 2: సిరియా రాజధానిలోని తమ దేశ రాయబార కార్యాలయంపై సోమవారం జరిగిన దాడికి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు ఇరాన్ జనరల్స్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైన ఇరాన్ జాతీయ భద్రతా మండలి.. ఇజ్రాయెల్ దాడులకు తగిన బదులివ్వాలని నిర్ణయించినట్టు ఆ దేశ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్పై ఇరాన్ నేరుగా తలపడుతుందా అన్నదానిపై స్పష్టతలేదు