తైమోర్: ఇండోనేషియా, ఈస్ట్ తైమోర్లో వచ్చిన తుఫాన్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈస్ట్ తైమోర్తో పాటు పలు ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సైక్లోన్ సెరోజా వల్ల గ్రామాలన్నీ నీటమునిగాయి. చెట్లు కూలిపోయాయి. సమీప సరిహద్దుల్లో ఉన్న దేశాలకు సుమారు పది వేల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. ఈస్ట్ తైమోర్ వద్ద ఉన్న దీవుల్లోనే కేవలం 130 మంది మరణించినట్లు రికార్డులు ఉన్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేర్కొన్నది. ఆచూకీ లేకుండాపోయిన 70 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. లెంబాటా దీవిలో తుఫాన్ తాకిడి అధికంగా ఉన్నది. జనవరిలో వెస్ట్ జావాలో వచ్చిన తుఫాన్ వల్ల సుమెదాంగ్ పట్టణంలో 40 మంది మృతిచెందారు. బోర్నియాలో గత ఏడాది సెప్టెంబర్లో మట్టిచరియలు విరిగిపడడం వల్ల 11 మంది మరణించారు.