న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో.. 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని అరెస్టు చేశారు. అతనిపై నేరాభియోగాలు నమోదు చేశారు. దిలీప్ కుమార్ బ్రహ్మదత్, బిందు బ్రహ్మదత్, యశ్కుమార్ బ్రహ్మదత్లను ఓమ్ బ్రహ్మదత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. న్యూ డర్హమ్ రోడ్డులోని కొప్పొలా డ్రైవ్ వద్ద కాల్పుల శబ్ధం వినబడడంతో పోలీసులు అక్కడకు వెళ్లినట్లు ప్రకటనలో తెలిపారు. భార్యాభర్తలు దిలీప్, బిందులు మర్డర్ కాగా, వాళ్ల కుమారుడు యశ్కుమార్ కూడా మరో ఫ్లోర్లో శవమై తేలాడు. హత్య జరిగిన రోజున ఓమ్ 911కి ఫోన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆన్లైన్లో కొన్ని హ్యాండ్గన్తో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.