న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వైఖరిని బిలియనీర్ జార్జ్ సోరస్ తప్పుపట్టారు. ఇటీవల మునిచ్లో జరిగిన సెక్యూర్టీ కాన్ఫరెన్స్లో భారత ప్రధానిపై సోరస్ విమర్శలు చేశారు. అదానీ గ్రూపు సంక్షోభాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన సోరస్.. విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్టాక్స్ విషయంలో అదానీ మోసాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపైన కూడా పార్లమెంట్లో ఆయన వివరణ ఇవ్వాలని జార్జ్ తెలిపారు. అదానీ మోసాలపై అమెరికాకు చెందిన హిండెబన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక పెను సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
అదానీ సంక్షోభం మోదీని బలహీనపరచనున్నట్లు సోరస్ అభిప్రాయపడ్డారు. భారత సమాఖ్య ప్రభుత్వంపై మోదీకు ఉన్న నియంత్రణ క్రమంగా నిర్వీర్యం కానున్నట్లు ఆయన వెల్లడించారు. అదానీ ఘటనతో వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టాల్సి వస్తుందన్నారు. భారత్లో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం తప్పదన్నారు.
హిండెన్బర్గ్ రిపోర్టు ఇచ్చిన తర్వాత జనవరి 24వ తేదీ నుంచి అదానీకి చెందిన ఏడు కంపెనీలు ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లలో బిలియన్లు కోల్పోయి.